కర్నాటక కాంగ్రెస్ కార్యకర్తలు బబ్బర్ షేర్లు రాహుల్ కితాబు
కర్నాటకలో బుధవారం ఓటింగ్ జరిగిన అసెంబ్లీ ఎన్నికల కోసం “గౌరవప్రదమైన, పటిష్టమైన ప్రజలను భాగస్వామ్యం చేసేలా ప్రచారాన్ని” నిర్వహించిన నాయకులు, కార్యకర్తలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలిపారు. వారందరూ “బబ్బర్ షేర్” (సింహాలు)గా రాహుల్ అభివర్ణించారు. కర్నాటక ‘ప్రగతిశీల భవిష్యత్తు’ కోసం ఓటు వేయడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
ఎగ్జిట్ పోల్లు కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యాన్ని ఇవ్వడంతో ఆ పార్టీలో ఉత్సాహం తొణికిసలాడుతోంది. నలుగు సర్వేలు కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీని అందివ్వగా, రెండు సర్వేలు బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయని అంచా వేశాయి. మరికొన్ని సర్వేలు హంగ్ కు ఛాన్స్ ఉంటుందన్న భావన వ్యక్తం చేశాయి. కర్నాటకలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఓటింగ్ జరిగింది మరియు ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ మార్క్ 113 సీట్లు. శనివారం ఫలితాలు వెల్లడికానున్నాయి.