లేటెస్ట్ టెక్నాలజీతో రానున్న కమల్ హాసన్ ‘ఇండియన్ -2’
విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన, శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఇండియన్ 2 చిత్రాన్ని సరికొత్తగా, లేటెస్ట్ టెక్నాలజీనుపయోగించి చిత్రీకరించబోతున్నారు దర్శకుడు శంకర్. కమల్ చిత్రం ఇండియన్ (భారతీయుడు) చిత్రం ఎంత ఘనవిజయం సాధించిందో మనందరకూ తెలుసు. అవినీతిపరులను హత్యలు చేసే స్వాతంత్య్ర సమర యోధునిగా కమల్ నటించిన చిత్రం అప్పట్లో అందర్నీ అలరించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సరికొత్త టెక్నాలజీని వాడి చనిపోయిన నటుల్ని కూడా ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
![](https://www.manasarkar.com/wp-content/uploads/2023/07/indian2.jpg)
ఇండియన్ చిత్రంలో పోలీస్ ఆఫీసర్గా నటించిన నెడుముడి వేణు ఈ మధ్యనే చనిపోయారు. ఇప్పుడు ఆయన ఇండియన్ 2లో టెక్నాలజీ ద్వారా గెస్ట్ రోల్లో నటించబోతున్నారు. అలాగే చనిపోయిన కమెడియన్ వేణును కూడా ఇండియన్ 2లో కనిపించబోతున్నారట. ఇలా కరోనాతో చనిపోయిన వీరిని ఈ చిత్రంలో చూపించడానికి బలమైన కారణమే ఉంది. ఎందుకంటే ఈ చిత్రం మొదలుపెట్టి నాలుగేళ్లు పైనే అవుతోంది. అప్పుడు వీరిద్దరూ ఈ చిత్రంలో నటిస్తున్నారు. మధ్యలో కరోనా లాక్ డౌన్, బడ్జెట్ సమస్యలతో చిత్రీకరణ ఆలస్యం అయ్యింది. ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ 80 శాతం పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో కమల్తో పాటు కాజల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య వంటివారు నటిస్తున్నారు. 350 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపుదిద్దుకుంటోంది ఈ చిత్రం.