Home Page SliderTelangana

కాళేశ్వరం న్యాయ కమిషన్ గడువు 2 నెలలు పొడిగింపు

Share with

జస్టిస్ పీవీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కాళేశ్వరం న్యాయ కమీషన్ గడువును మరో రెండునెలలు పొడిగించారు తెలంగాణ ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టుపై ENCలు, CEలు, ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు దాదాపుగా 60 మంది సీల్డ్ కవర్లలో అఫిడవిట్లు దాఖలు చేశారు. ఈ విచారణ జస్టిస్ ఘోష్ ఆదేశాల మేరకు జరిగింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజిలపై విచారణకు ఇచ్చిన గడువు జూన్ నెలాఖరుకు (30 వ తేదీకి) ముగియనుంది. అయితే వారి విజ్ఞప్తి మేరకు మరో రెండునెలలు పొడిగించారు. దీనితో ఆగస్టు 31 వరకూ అవకాశం దొరికినట్లయ్యింది.