జంగ్ తెలంగాణ: ఎవరికి వారే ఓటర్లను ప్రసన్నం చేసుకునే తంటాలు
హీటెక్కించిన విమర్శలు.. హోరెత్తించేలా ప్రచారాలు.. ఎవరికి వారే ఓటర్లను ప్రసన్నం చేసుకునే తంటాలు. కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమా. అభివృద్ధి తామే చేశామని.. మరో అవకాశం ఇస్తే ఇంకా చేస్తామని, చేసిందేమీ లేదని.. తమకు అధికారం ఇస్తే సిసలైన అభివృద్ధి చేసి చూపిస్తామని.. ఇలా హామీల మీద హామీలతో సై అంటే సై అంటూ ఎన్నికల సమరంలో దూకారు. మరి ఖానాపూర్ నియోజకవర్గంలో ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందో.. ప్రజలు ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారో చూడాలి..