ముద్రగడ లేఖపై జనసేన ఘాటు వ్యాఖ్యలు
ముద్రగడ పవన్కు రాసిన లేఖపై జనసేన ఘాటుగా స్పందించింది. ద్వారం పూడి ఉద్యమం కాపులకు సహకరించిందన్న ముద్రగడ వ్యాఖ్యలపై జనసేన తిప్పికొట్టింది. జనసేన నేత నానాజీ, ముద్రగడ మాటలకు నవ్వొస్తోందని పేర్కొన్నారు. వైసీపీ నిధులతో సభలు పెట్టిన ముద్రగడ , పవన్ గురించి ఎలా చెప్తున్నారన్నారు జనసేన నేత కిరణ్ రాయల్. . తన కొడుక్కి ఎమ్మెల్యే సీటు, తనకు ఎంపీ సీటు కావాలని ఆశిస్తున్నారని, అందుకే పవన్ను విమర్శిస్తున్నాడని, జగన్ను మంచి చేసుకునే ప్రయత్నమే ఇదంతా అని ఆయన పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం కాపు ద్రోహి అని అంటున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఉద్యమాలు చేసారని, ఇప్పుడెందుకు చేయట్లేదని ప్రశ్నించారు.