Andhra PradeshHome Page Slider

గొల్లప్రోలులో జనసేన కృతజ్ఞత సభ

Share with

జనసేన అధినేత,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ పిఠాపురంలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన గొల్లప్రోలులో ఈ రోజు ఉదయం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి పిఠాపురం పర్యటిస్తున్నారు. దీంతో పవన్ గొల్లప్రోలులో జనసేన కృతజ్ఞత సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో పవన్ జనసేన కార్యకర్తలు,మహిళలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో లా అండ్ ఆర్డర్ చాలా కఠినంగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో చాలా కఠినంగా ఉంటానన్నారు. కొన్ని విషయాల్లో కఠినంగా ఉండక తప్పదని పవన్ స్పష్టం చేశారు.