Andhra PradeshHome Page Slider

విశాఖలో వీఐపీ రోడ్ జంక్షన్ వద్ద జనసేన ఆందోళన

Share with

విశాఖలో వీఐపీ రోడ్ వద్ద జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వైసీపీ ఎంపీకి సంబంధించిన నిర్మాణాలకు వాస్తు దోషం కారణంగా ఈ జంక్షన్ వద్ద డివైడర్లను మూసేసారని  వారు ఆరోపిస్తున్నారు. ఎన్నడూ అక్కడ ట్రాఫిక్ జామ్ లేదని, ఇప్పుడు ఎంపీకి సంబంధించిన భూముల కోసం, నిర్మాణాల కోసం అక్రమంగా జంక్షన్లు మూసేస్తున్నారని వారి వాదిస్తున్నారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు సంబంధించిన ఈ నిర్మాణాల కోసం, ఇబ్బంది లేకుండా  ఉండడానికి, పైగా ఆ నిర్మాణాలకు వీదిపోటు ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి చర్యలు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఈ విషయంపై అధికారులను ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని, ట్రాఫిక్‌ సమస్యల వల్లే ఈ డివైడర్లు మూసేసామని తెలియజేస్తున్నారు.