Andhra PradeshHome Page Slider

“జైలు ఏమైనా చంద్రబాబు అత్తాగారి ఇల్లా”:సజ్జల

Share with

గతకొన్ని రోజులుగా జైలులో ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో ఆయన కుటుంబ సభ్యులు చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ చంద్రబాబుకు ఏమైనా జరిగితే సీఎం జగనే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. దీనిపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని సజ్జల మండిపడ్డారు. రాజమండ్రి జైలులో ఉక్కపోత పెరిగితే చంద్రబాబుకు మాత్రమే కాదు అందరికీ సమస్యలు ఉంటాయన్నారు. జైలు ఏమైనా చంద్రబాబు అత్తగారి ఇల్లా..ఏసీ అడుగుతున్నారు అని సజ్జల ప్రశ్నించారు. అయినా చంద్రబాబుకు ఇంటి నుంచే భోజనం వస్తుంది. కాగా ఆ భోజనాన్ని అధికారులు పరిశీలించిన తర్వాతే చంద్రబాబుకు ఇస్తున్నారు. అయితే అర్జంటుగా చంద్రబాబును జైలు నుంచి బయటకు తీసుకు రావాలనేదే టీడీపీ ప్లాన్ అని సజ్జల రామాకృష్ణా రెడ్డి ఆరోపించారు.