Home Page SliderTelangana

మైత్రీమూవీస్‌కు ముంబై లింకులపై ఐటీ అధికారుల ఆరా

Share with

ప్రసిద్ధ తెలుగు చిత్ర నిర్మాణసంస్థ మైత్రీ మూవీస్‌కు ముంబై ఫైనాన్సియర్స్‌కు ఉండే లింకులపై ఆరా తీస్తున్నారు ఢిల్లీ ఐటీ అధికారులు. వారి  ఆఫీసులో, ఇళ్లలో ఐటీ అధికారులు నిన్నటి నుండి సోదాలు జరుపుతున్నారు. ఈ రోజు కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. దర్శకుడు సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. తాజాగా బాలీవుడ్ లింకులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఐటీ అధికారులు. ముంబై ఫైనాన్షియర్ వద్ద డబ్బు తీసుకుని బాలీవుడ్ సినిమా ప్లాన్ చేసారు  మైత్రి మూవీస్. ఈ సినిమా కోసం బాలీవుడ్ డైరక్టర్‌కు భారీగా అడ్వాన్సుకూడా ఇచ్చినట్లు గుర్తించారు. గత రెండు రోజులుగా ముంబైలో ఫైనాన్సియర్స్ ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు.  ఈ డబ్బుతో హైదరాబాదు శివార్లలో  వందల ఎకరాల్లో భూములు కొన్నట్లు గుర్తించారు.