ఇది థర్డ్ ఫ్రంట్ కాదు స్టాండర్డ్ ఫ్రంట్ : బీహార్ సీఎం నితీష్ కుమార్
బీజేపీ నుంచి విడిపోయి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక బీహర్ సీఎం నితీశ్ కుమార్ మంచి ఊపుమీదున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా.. ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయటానికి చర్యలు ముమ్మరం చేశారు. దీంట్లో భాగంగా నితీశ్ కుమార్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశమవుతున్నారు. వారితో పలు అంశాలపై చర్చిస్తున్నారు. బీజేపీయేతర పార్టీలను 2024 ఎన్నికల కల్లా ఏకం చేయాలనే లక్ష్యంతో నితీశ్ కుమార్ వ్యూహాలు రచిస్తున్నారు. దీంట్లో బాగంగానే ఢిల్లీలో పర్యటిస్తూ పలువురు కీలక నేతలతో సమావేశమవుతున్నారు.
![](https://www.manasarkar.com/wp-content/uploads/2022/09/image-209.png)
నితీష్ కుమార్ మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఐఎన్ఎల్డీ అధినేత ఓపీ చౌతాలా, సమాజ్వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు..యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ(ఎంఎల్) నేత దీపాంకర్ భట్టాచార్య,ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో సమావేశమయ్యారు.
![](https://www.manasarkar.com/wp-content/uploads/2022/09/image-210.png)
ఈ కీలక సమావేశాల నేపథ్యంలో నితీశ్ కుమార్ మాట్లాడుతూ..పలు రాష్ట్రాల్లోని 2024 లోక్సభ ఎన్నికలకు బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే.. పరిస్థితులు విభిన్నంగా ఉంటాయని అన్నారు. నేను నాయకుడిని కాను..కేవలం ప్రతిపక్షాలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఎన్నికల్లో పోరాడితేనే విజయం సాధిస్తామని అన్నారు. బీజేపీయేతర పార్టీలంతా ఐక్యంగా.. ఒక ప్రధాన ఫ్రంట్ని నిర్మిస్తాము..అది థర్డ్ ఫ్రంట్ కాదు…అదే మెయిన్ ఫ్రంట్ అని నితీష్ కుమార్ అన్నారు.