Andhra PradeshHome Page Slider

చౌకగా ఫైబర్ గ్రిడ్‌ను పూర్తిచేయడమే చంద్రబాబు చేసిన నేరమా?: పట్టాభి

Share with

దేశంలో అతి తక్కువ ఖర్చుతో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును కంప్లీట్ చేయడమే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన నేరమా? అని ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ప్రశ్నించారు.

అమరావతి: దేశంలో అతి తక్కువ ఖర్చుతో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును కంప్లీట్ చేయడమే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన నేరమా? అని ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ప్రశ్నించారు.

టెలికమ్ లైసెన్స్ సాధించిన మొట్టమొదటి రాష్ట్రంగా ఏపీకి చంద్రబాబు ఘనత సాధించి పెట్టారన్నారు. ఈ మేరకు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలు చేసిన ఖర్చును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పట్టాభి వివరించారు. డబ్బును ఆదా చేసినందుకా చంద్రబాబును నిర్బంధించారని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన నేరమా? అని పట్టాభి ప్రశ్నించారు.