Andhra PradeshHome Page Slider

అంబటిరాయుడు రాజకీయ రంగప్రవేశం వైసీపీతోనేనా?

Share with

క్రికెటర్ అంబటిరాయుడు రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. వీటిపై అంబటి రాయుడు ఎప్పుడు పెద్దగా స్పందించలేదు. అయితే ఆయన తాజాగా తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో సీఎం జగన్‌తో భేటి అయ్యారు. ఈ భేటిలో అంబటిరాయుడు ఏపీలో క్రీడల అభివృద్ది,శిక్షణ,యువతకు అవకాశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఏపీలో సీఎం జగన్ ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలను అంబటి రాయుడు ట్విటర్ వేదికగా ప్రశంసిస్తూ..వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి భేటి ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో అంబటిరాయుడు త్వరలోనే వైసీపీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది.