Andhra PradeshHome Page Slider

సీఎం జగన్ వల్ల పెట్టుబడులు వెనక్కిపోతున్నాయి: చంద్రబాబు

Share with

టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏపీలో ఉన్న 1000 కిలోమీటర్ల తీర ప్రాంతంతో..సముద్ర మార్గాన ఇతర దేశాలతో వ్యాపారానికి టీడీపీ హయాంలో ప్రణాళికలు రూపొందించామన్నారు.  అందులో భాగంగానే కృష్ణపట్నం నుంచి భావనపాడు వరకు ఉన్న పోర్ట్‌ల అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. కాగా టీడీపీ హయాంలో రూ.16 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చామని చంద్రబాబు తెలిపారు. ఈ విధంగా ఏపీని అభివృద్ధి చేయాలని ప్రణాళికలు వేశామన్నారు. అయితే సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఈ పెట్టుబుడలు అన్ని వెనక్కి వెళ్లిపోతున్నాయని చంద్రబాబు  విమర్శించారు.