Home Page SliderNational

నీట్ లీకేజీపై సుప్రీంలో విచారణ

Share with

నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీంతో నీట్ ఎగ్జామ్‌ లీకేజీపై విచారణ చేపట్టాలని బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే పేపర్ లీకైన కారణంగా నీట్ ఎగ్జామ్ కౌన్సిలింగ్‌ను నిలిపివేయాలని వారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కౌన్సిలింగ్‌ను నిలిపివేసేందుకు నిరాకరించింది. దీనిపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఎన్డీయేకు నోటీసులు జారీ చేసింది.