‘బాస్టిల్ డే పరేడ్’లో భారత బృందాలు –గౌరవ అతిథిగా మోదీ
ఐరోపాలోనే అతిపెద్ద సైనిక కవాతుగా నిలిచిన బాస్టీల్ డే పరేడ్లో భారత సేనలు కూడా పాల్గొన్నాయి. భారత సాయుధదళాలకు చెందిన 269 మంది సభ్యుల బృందంలో నాలుగు రఫేల్ విమానాలు, 2 సీ-17 గ్లోబ్ మాస్టర్లు కూడా ఉన్నాయి. ఇవి పారిస్ గగన తలంలో తమ విన్యాసాలు ప్రదర్శించాయి.
![](https://www.manasarkar.com/wp-content/uploads/2023/07/image-57.png)
ఈ పరేడ్ చాలా బాగా జరిగిందని, భారత్తో స్నేహ సంబంధాలు ఫ్రాన్స్కు ఎంతో సంతోషంగా ఉందని, భారత్ను అతిథిగా ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ వ్యాఖ్యానించారు. దీనికి జవాబుగా మోదీ కూడా ఈ సంబరాలపై ఫ్రాన్స్- భారత్ సంబంధాలపై ట్వీట్ చేశారు. 140 కోట్ల మంది భారతీయులు ఫ్రాన్స్ భారత్ సత్సంబంధాలపై సంతోషంగా ఉన్నారని మోదీ ట్వీట్ చేశారు.