పవన్ కళ్యాణ్ ఏ విప్లవంలో పాల్గొన్నారో చెప్పాలి:అంబటి
ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కుతున్నాయి. కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించినప్పటి నుంచి అధికార,ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం మొదలైనట్లు కన్పిస్తోంది. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అయితే దీనిపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ ఓ రౌడీలా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పిచ్చి కుక్కలా స్వైరవిహారం చేశాడని అంబటి ఘాటు విమర్శలు చేశారు. పవన్ మాటలకు నవ్వాలో ,ఏడవాలో అర్థం కావడం లేదన్నారు. మాట్లాడితే పవన్ విప్లవం అంటున్నారన్నారు. ఇంతకీ పవన్ ఏ విప్లవంలో పాల్గొన్నారో చెప్పాలని అంబటి ప్రశ్నించారు. 3 పెళ్లిళ్ల వీరుడు నీతులు చెప్పడం ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలా అని అంబటి దుయ్యబట్టారు. పవన్ ఏపీలో కులాలను రెచ్చగొడుతున్నారన్నారు. సినిమా,కులపిచ్చితో పవన్ యువత ఆదర్శంగా తీసుకోవద్దని అంబటి కోరారు.