తెలంగాణ ఎన్నికల బరిలో బీజేపీ హేమాహేమీలు..సీట్లు పక్కా..
రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో విజయం సాధించాలని బీజేపీ దృఢసంకల్పంతో ఉంది. ఎలాగైనా అసెంబ్లీలో మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా హేమాహేమీలను రంగంలోకి దించింది. దాదాపు 31 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లే విశ్వసనీయ వర్గాల సమాచారం. కేసీఆర్పై పోటీ చేసి తీరతానని శపథం చేసిన ఈటల రాజేందర్కు ఆయన కోరినట్లే రెండుస్థానాలలో టిక్కెట్లు దొరికే అవకాశం ఉంది. హుజూరాబాద్, గజ్వేల్ నియోజక వర్గాల నుండి ఈటల పోటీ చేసే అవకాశం ఉంది. గెలుపు ఖాయమనుకున్న నేతలను ఎన్నికల బరిలో దించాలని పార్టీ యోచిస్తోంది. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కీలక శక్తిగా మారాలని భావిస్తున్న బీజేపీ అందుకు అనుగుణంగా కసరత్తు తీవ్రతరం చేస్తోంది. అభ్యర్థుల ఎంపికతోనే పార్టీ విజయం సాధ్యమని భావిస్తున్న బీజేపీ పెద్దలు సీనియర్ నేతలను బరిలోకి దించాలని భావిస్తోంది.
![](https://www.manasarkar.com/wp-content/uploads/2023/10/image-227.png)
–
నియోజక వర్గం | అభ్యర్థి | నియోజక వర్గం | అభ్యర్థి | నియోజక వర్గం | అభ్యర్థి |
హుజూరాబాద్, గజ్వేల్ | ఈటల రాజేందర్ | వేములవాడ | చెన్నమనేని వికాస్ | ఉప్పల్ | ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ |
ఖానాపూర్ | రమేశ్రాథోడ్ | సిరిసిల్ల | రాణి రుద్రమదేవి | గద్వాల | డి.కె.అరుణ |
ఆదిలాబాద్ | పాయల్శంకర్ | నారాయణ్ ఖేడ్ | సంగప్ప | వికారాబాద్ | కొప్పు బాషా |
బోథ్ | సోయం బాపురావు | అందోలు | బాబుమోహన్ | కల్వకుర్తి | ఆచారి |
కోరుట్ల | ధర్మపురి అర్వింద్ | పటాన్ చెరు | నందీశ్వర్ గౌడ్ | హుజూర్ నగర్ | శ్రీలతారెడ్డి |
కరీంనగర్ | బండి సంజయ్ | దుబ్బాక | రఘునందన్ రావు | సూర్యాపేట | సంకినేని వెంకటేశ్వర్ రావు |
చొప్పదండి | బొడిగె శోభ | కుత్భుల్లాపూర్ | కూన శ్రీశైలం గౌడ్ | భువనగిరి | గూడూరు నారాయణరెడ్డి |
జనగామ | దుష్యంత్ రెడ్డి | స్టేషన్ ఘన్పూర్- | విజయరామారావు | మహబూబాబాద్ | హుస్సేన్ నాయక్ |
వరంగల్ వెస్ట్ | రావు పద్మ | వరంగల్ ఈస్ట్ | ఎర్రబెల్లి ప్రదీప్ రావు | భూపాల పల్లి | కీర్తిరెడ్డి |
నిర్మల్ | మహేశ్వర్ రెడ్డి | ధర్మపురి | ఎస్.కుమార్ | చెన్నూరు | జి. వివేక్ |