ధరణిలో ఇక ప్రతి అప్లికేషన్ తహశీల్దార్ పరిశీలిస్తారు
భూ సమస్యలపై ధరణి ద్వారా పెట్టుకునే ప్రతి దరఖాస్తు ఇకమీదట సంబంధిత మండల తహశీల్దార్లకే చేరనుంది. అక్కడి నుంచే ఆర్డీఓలు, అడిషనల్ కలెక్టర్లు (రెవెన్యూ), జిల్లా కలెక్టర్ల లాగిన్ లోకి దరఖాస్తులు ఫార్వర్డ్ కానున్నాయి. ఈ విధానం నిన్నటి నుండే అమల్లోకి వచ్చింది. అప్లికేషన్ విధానాన్ని స్ట్రీమ్లైన్ చేసేందుకు కిందిస్థాయి ఆఫీసర్ నుండి పైస్థాయి ఆఫీసర్ వరకు వెళ్లేలా మాడ్యుల్లో మార్పులు చేశారు.