Home Page SliderNational

“మేం దేశాన్ని కలిపితే,బీజేపీ విడగొడుతుంది”: రాహుల్ గాంధీ

Share with

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ బీహర్‌లోని పాట్నాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో పాట్నాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ..బీజేపీనీ ఓడించేందుకే విపక్షాలన్నీ ఇక్కడికి వచ్చాయన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మరోసారి బీజేపీపై మండిపడ్డారు. కాంగ్రెస్ దేశాన్ని కలిపితే,బీజేపీ విడగొడుతుందని రాహుల్ గాంధీ విమర్శించారు. దేశంలో బీజేపీ ద్వేషాన్ని వ్యాప్తింపజేస్తోందన్నారు. దేశంలో హింసను ప్రోత్సహిస్తూ..దేశాన్ని విడగొడుతుందని రాహుల్ గాంధీ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. అయితే దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రేమను పంచే ప్రయత్నం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నినాదం “భారత్ జోడో” అయితే..బీజేపీ,RSS  నినాదం “భారత్ తోడో” అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.