Home Page SliderNational

రాహుల్ క్షమాపణ చెబితే ఇది ఎప్పుడో ముగిసిపోయేది:బీజేపీ ఎంపీ

Share with

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో గుజరాత్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు తాజాగా కొట్టివేసింది. దీంతో రాహుల్ గాంధీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. కాగా దీనిపై బీజేపీ ఎంపీ రవి శంకర్ స్పందించారు. ఎంపీ రవి శంకర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు రాహుల్ గాంధీని నియంత్రించడం లేదని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పి ఉంటే ఎప్పుడో ఈ అంశం ముగిసిపోయి ఉండేదని తెలిపారు. కానీ అలా జరగలేదన్నారు. దేశంలోని ప్రముఖ నాయకులపై దుర్భాషలాడటం ,వారి పరువు తీయడం రాహుల్‌కు అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు.