Andhra PradeshHome Page Slider

జగన్ పులివెందుల రౌడీయిజం చేస్తే..చూస్తూ ఊరుకోం: పవన్ కళ్యాణ్

Share with

ఏపీలో రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ రోజు కృష్ణా జిల్లాలో పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు జనసేన పార్టీ పెడనలో నిర్వహించబోయే సభలో వైసీపీ ప్రభుత్వం రాళ్ల దాడి చేయడానికి కుట్ర చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేస్తారు. కాగా జనసేన సభను అడ్డుకోవడానికి క్రిమినల్స్‌ను కూడా దింపారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.ఈ మేరకు రేపు పెడనలో జరగబోయే జనసేన సభకు 3000మంది రౌడీ మూకలు వచ్చే అవకాశముందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సభలో రాళ్ల దాడి చేసి గొడవలు సృష్టించాలని ప్లాన్ చేశారని పవన్ వెల్లడించారు. ఈ విధంగా చేసి టీడీపీ,జనసేన పొత్తును విఛ్చిన్నం చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తుందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అయితే రేపు పెడనలో జరగబోయే జనసేన సభలో గొడవలు సృష్టిస్తే సహించబోమని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.కాగా రేపు జరగబోయే పరిణామాలకు ఏపీ సీఎం జగన్,డీజీపీనే బాధ్యత వహించాలి అన్నారు. రేపు జరగబోయే సభలో దాడులు చేసినా..క్రిమినల్స్ ఎటాక్ చేసినా జనసైనికులు ఎదురు దాడి చెయ్యొద్దని పవన్ కళ్యాణ్ పిలుపు నిచ్చారు.  సభలో ఎవరు అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే పాలీసులకు అప్పగించాలని పవన్ కళ్యాణ్ జనసైనికులకు సూచించారు.