‘చంద్రబాబు అధికారంలోకి ఉంటే కరువు కాటకాలే’ కాకాణి ఘాటు వ్యాఖ్యలు
రుణమాఫీ పేరుతో రైతుల్ని ముంచేసిన టీడీపీకి వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత లేదని వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నెల్లూరులో మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో సాగు, తాగునీరు లేదని, చంద్రబాబు అధికారంలోకి ఉంటే కరువు కటకాలు విలయతాండవం చేస్తాయన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా లోకేష్ పాదయాత్రలో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదని, యువగళానికి స్పందనే లేదని ఆయన విమర్శించారు. ఏ పంట ఎక్కడ పండుతుందో కనీస పరిజ్ఞానం లేని లోకేష్ కూడా వ్యవసాయం గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుందన్నారు. సోమశిల లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొస్తామని చెబుతున్న లోకేష్.. చంద్రబాబు హయాంలో ఎందుకు చేయలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ హయాంలో నకిలీ విత్తనాలు, ఎరువులు పంపిణీ చేశారని కాకాణి మండిపడ్డారు.