Home Page SliderNational

కాన్పూర్‌లో వందల సంఖ్యలో అగ్నికి ఆహుతైన వస్త్ర దుకాణాలు

Share with

ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బాస్మండి అనే ప్రాంతంలో ఈరోజు(శుక్రవారం) తెల్లవారుజామున భారీ ఆగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు ఐదు వందల దుకాణాలు అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. తొలుత అక్కడ గల ఏఆర్ అనే టవర్ వద్ద మంటలు చెలరేగగా అక్కడకు దగ్గరలోనే ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లకు వేగంగా ఈ మంటలు వ్యాపించాయి. భారీ స్థాయిలో వ్యాపారులకు నష్టం జరిగినట్లు సమాచారం. 15 వరకూ ఫైరింజన్లు, సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్యూట్ కారణంగా భావిస్తున్నారు.