Home Page SliderTelangana

కాంగ్రెస్ ముందు నువ్వు..నీ కొడుకు ఎంత కేసీఆర్:భట్టి

Share with

తెలంగాణాలో కర్ణాటక ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ బాగానే పడ్డట్టు కన్పిస్తోంది. కాగా ఇటీవల కర్ణాటకలో జరిగిన  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న విషయ తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలు,నాయకుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. ఈ క్రమంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రిపీట్ అవుతాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దీనిపై తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. కాగా సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఒక్క రాష్ట్రంలో గెలిచినంత మాత్రాన పొంగిపోవాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణాలో కర్ణాటక ఫలితాలు రిపీట్ కావన్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. ఆయన మాట్లాడుతూ..కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నువ్వు ఎంత? మీ కొడుకు ఎంత? అల్లుడు ఎంత అని భట్టి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కదం తొక్కితే ..ఆ అడుగుల శబ్దానికే మీరు అదురుకొని చస్తారని భట్టి విక్రమార్క తెలిపారు. అలాంటి నువ్వా కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేది అని భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు.