Home Page SliderTelangana

తెలంగాణాలో విద్యాసంస్థలకు సెలవులు

Share with

తెలంగాణాలో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణాలో జనజీవనం అస్తవ్యస్థం అవుతోంది. కాగా ఈ భారీ వర్షాలకు విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రంలోని స్కూళ్లకు రెండు రోజులపాటు సెలవులు ప్రకటించింది. కాగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణా విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు గురువారం,శుక్రవారం విద్యాసంస్థలకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖమంత్రి ట్వీట్ చేశారు. మరోవైపు తెలంగాణా రాజధాని హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.