ప్రధాని మోదీకి అత్యున్నత గౌరవం
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న భారత్ ప్రధాని మోదీకి అత్యున్నత గౌరవం దక్కింది. ఫ్రాన్స్ దేశపు అత్యున్నత పౌర పురస్కారం, సైనిక పురస్కారాన్ని అందుకున్నారు మోదీ. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ చేతుల మీదుగా మోదీకి ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్’ పురస్కారాన్ని అందుకున్నారు. నేడు జరుగబోయే ఫ్రాన్స్ ‘నేషనల్ డే’ వేడుకలలో ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు భారత ప్రధాని. గురువారం ఎలీసీ ప్యాలెస్లో జరిగిన కార్యక్రమంలో మేక్రాన్ ఈ పౌర సన్మానం చేశారు. గతంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నెల్సన్ మండేలా, బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్, జర్మనీ మాజీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్, యునైటెడ్ నేషన్స్ మాజీ సెక్రటరీ జనరల్ బుట్రోస్ ఘలి ఈ అవార్డును అందుకున్నారు. ఈ సత్కారానికి మోదీ భారత ప్రజల తరపున మేక్రాన్కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అధ్యక్షభవనంలో మేక్రాన్ దంపతులు ప్రత్యేక విందును ప్రధాని మోదీకి ఆతిథ్యం ఇచ్చారు.