నేడే వరల్డ్ కప్లో హైవోల్టేజ్ మ్యాచ్(టీమిండియా vs. పాకిస్తాన్)
వరల్డ్ కప్లో ఈ రోజు ఉత్కంఠ పోరు జరగనుంది. కాగా ఇవాళ జరగబోయే వరల్డ్ కప్ మ్యాచ్లో టీమిండియా పాకిస్తాన్తో తలపడనుంది.అయితే ఈ రోజు అహ్మదాబాద్ స్టేడియంలో మధ్యహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. టీమిండియా ,పాకిస్తాన్ జట్టులు వరుస మ్యాచుల్లో గెలిచి జోరు మీద ఉన్నాయి. అయితే ఇప్పటివరకు జరిగిన వరల్డ్ కప్ మ్యాచుల్లో పాకిస్తాన్పై టీమిండియా ఎప్పుడూ ఓడిపోలేదు. దీంతో పాకిస్తాన్ ఈసారి టీమిండియాపై ప్రతీకారం తీర్చుకుంటామంటోంది. కాగా ఈ రోజు జరగబోయే టీమిండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించాలని ప్రత్యేక పూజల చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఉత్కంఠ భరితమైన మ్యాచ్ను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు భారీ సంఖ్యలో అహ్మదాబాద్ స్టేడియంకు చేరుకున్నారు. దీంతో ప్రస్తుతం అహ్మదాబాద్ స్టేడియం క్రికెట్ అభిమానులతో నిండిపోయి సందడి వాతావరణం నెలకొంది.