KCR పిటిషన్పై తీర్పుని రిజర్వ్లో ఉంచిన హైకోర్టు
విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయంలో లోటుపాట్లను సమీక్షించడానికి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటుపై మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. అయితే తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. కేసీఆర్ పిటిషన్పై తీర్పును ఈ రోజు లేదా సోమవారం వెల్లడిస్తామని హైకోర్టు తెలిపింది.