అమరావతి రైతులకు హైకోర్టు శుభవార్త
రాజధాని ప్రాంతంలో అమరావతి రైతులు తలపెట్టిన మహాపాదయాత్రకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ప్రభుత్వం, పోలీసులు పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అమరావతి పరిరక్షణ సమితి పిటిషన్ పై విచారించిన హైకోర్టు పాదయాత్రకు అనుమతివ్వాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. పాదయాత్రలో పాల్గొనే 600 మందికి ఐడీ కార్డులు ఇచ్చి యాత్రకు అనుమతివ్వాలంది. పాదయాత్రకు హైకోర్టు అనుమతివ్వడంతో రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో పాదయాత్ర ముగింపు సమయంలో నిర్వహించే సభకు సైతం అనుమతి తీసుకోవాలని రైతులను కోర్టు పేర్కొంది. రైతుల దరఖాస్తును పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. రాజధాని రైతుల తరపున సీనియర్ న్యాయవాదులు ఉన్నం మురళీధర్, వీవీ లక్ష్మీనారాయణ వాదనలు విన్పించారు.
![](https://www.manasarkar.com/wp-content/uploads/2022/09/image-245.png)