NewsTelangana

హైకమాండ్‌ పిలుపుతో ఢిల్లీకి ఈటల, రాజగోపాల్‌ రెడ్డి

Share with

హైకమాండ్‌ నుంచి పిలుపు రావడంతో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు ఢిల్లీకి పయనమయ్యారు. నేడు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ కానున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్లకు గట్టి పోటీనివ్వడంతో బీజేపీ శ్రేణులు సంతోషంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరింత బలోపేతం కావడానికి వీరికి అమిత్‌ షా మార్గనిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే డీకే అరుణ ఢిల్లీకి చేరుకున్నారు. మరో వైపు ఈ నెల 20వ తేదీ నుంచి 3 రోజుల పాటు బీజేపీ శిక్షణా తరగతులు జరుగనున్నాయి.