Home Page SliderTelangana

వరద బాధిత జిల్లాలకు హై అలర్ట్… స్పెషల్ అధికారుల నియామకం

Share with

రాష్ట్రవ్యాప్తంగా అతిభారీ వర్షాల కారణంగా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. వరద బాధిత జిల్లాలకు హైఅలర్ట్ ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు భారీ వర్షాలు , వరదల నేపథ్యంలో జిల్లా యంత్రాంగానికి సహకరించేందుకుగాను పలు జిల్లాలకు పలువురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు .
1 ములుగు జిల్లా – కృష్ణ ఆదిత్య, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సభ్య కార్యదర్శి.
2 .భూపాల పల్లి – పి గౌతమ్, సెర్ప్, సి.ఈ.ఓ
3 . నిర్మల్ – ముషారఫ్ అలీ, ఎక్సయిజ్ శాఖ, కమీషనర్
4 . మంచిర్యాల – భారతి హోలికేరి, మహిళా, శిశు సంక్షేమ శాఖ , స్పెషల్ సెక్రెటరీ.
5 . పెద్దపల్లి – సంగీత సత్యనారాయణ,
6 .ఆసిఫాబాద్ – హన్మంత రావు, పంచాయితీరాజ్ శాఖ కమీషనర్