Home Page SliderNational

రాబోయే 24 గంటల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Share with

తెలుగు రాష్ట్రాలను వర్షాలు ఇప్పుడప్పుడే వదిలేలా లేవు. కాగా తెలుగు రాష్ట్రాల్లో గత 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే ఇవాళ కాసేపు వర్షం బ్రేక్ ఇచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ మరో పిడుగులాంటి వార్తను అందించింది. అదేంటంటే రాబోయే 24 గంటల్లో ఏపీ,తెలంగాణాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ  పేర్కొంది. కాగా కోస్తాంధ్రా – ఒడిశా తీరాలను ఆనుకొని అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణా, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అయితే ఈ నెల 25వరకు మోస్తరు నుంచి విస్తారంగా జల్లులు కురిస్తాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది.