Home Page SliderNational

జైలు నుండి ప్రభుత్వాన్ని నడపడం కాదు గ్రూపులను నడుపుతారు: బీజేపీ

Share with

ఢిల్లీ ప్రభుత్వాన్ని అరవింద్ కేజ్రీవాల్ జైలు నుండే నడిపిస్తారంటూ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అతీషి చేసిన వ్యాఖ్యపై బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఘాటుగా స్పందించారు. ఢిల్లీ ఈ దుస్థితికి రావడానికి కారణమే కేజ్రీవాల్. ప్రజలు అతనిపై కోపం ప్రదర్శిస్తున్నారు. అందుకే అరెస్టు చేస్తే స్వీట్లు పంచుకున్నారు. రాష్ట్రంలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఏ పనీ చేయలేదు. ముఖ్యమంత్రి అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ చేపడుతున్న నిరసనల గురించి కూడా ప్రజలు ఎక్కడా చర్చించుకోవట్లేదని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతోంది… మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ ప్రమేయం గురించి త్వరలో ప్రజలకు తెలుస్తుంది. అని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సచ్‌దేవా తెలిపారు.