శ్రీశైలం ఆలయంలో ఘనంగా ఉగాది మహోత్సవాలు
ఏపీ: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఇవాళ సరస్వతి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం స్వామి అమ్మవార్లకు నందివాహనం సేవ ఉంటుందని అర్చకులు తెలిపారు. ప్రత్యేక పూజల అనంతరం పురవీధుల్లో గ్రామోత్సవం, ప్రభోత్సవం కార్యక్రమాలు ఉంటాయని ఆలయ అర్చకులు వెల్లడించారు.