ఏపీ రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
ఏపీ రైతులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుభవార్త చెప్పారు.కాగా ఈ రోజు ఏపీ ఇందన శాఖమంత్రిగా గొట్టిపాటి రవికుమార్ సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వేదపండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆయన రాష్ట్రంలో కొత్తగా 40,336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేశారు.కాగా ఆ ఫైల్ మీదే ఆయన ఇందన శాఖ మంత్రిగా తొలి సంతకం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ విద్యుత్ కనెక్షన్ల మంజూరు,ప్రధాని సూర్యఘర్ పథకంలో భాగంగా ఇంటింటికీ 3కిలోవాట్ల సోలార్ కరెంట్ అందించే ఫైళ్లపైనా మంత్రి సంతకం చేశారు. కాగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ..ఏపీ విద్యుత్ శాఖను దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామన్నారు.