Home Page SliderTelangana

రంజాన్ ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

Share with

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ శుక్రవారం డా. బీ.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయ ప్రాంగణం సమీపంలో ఉన్న మసీదులో ప్రార్థనలో పాల్గొన్నారు. నమాజ్ అనంతరం మసీద్ ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రంజాన్ మాసంలో మసీద్ కు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు వచ్చే అవకాశమున్నందన వారి సౌకర్యార్థం మసీద్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, ఇందు కోసం మసీద్ వెలుపల గల ఖాళీ స్థలంలో తగు సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా మసీదుకు గ్రిల్స్ ఫెన్సింగ్, గేట్లను, అదనంగా టాయిలెట్స్ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.