Home Page SliderTelangana

వాహనాలకు చలాన్లు ఉన్న వారికి గుడ్ న్యూస్

Share with

టూ వీలరో, కారో ఉన్నవారికి ఎక్కడో ఒకచోట, ఏదో ఒక సందర్భంలో చలాన్లు పడడం మామూలే. తెలంగాణలోని పెండింగ్ చలాన్ల కోసం రాయితీలు ఇవ్వాలని భావిస్తోంది పోలీస్ శాఖ. గత సంవత్సరం ఇలాగే రాయితీ ఇస్తే రూ. 300 కోట్ల చలానాలు వసూలయ్యాయి. ఇప్పుడు కూడా పెండింగ్ చలాన్లు అధిక సంఖ్యలో ఉన్నాయి. దీనితో మళ్లీ రాయితీ ఇస్తే అవన్నీ వసూలవుతాయని భావిస్తున్నారు. కొన్ని చోట్ల స్పీడ్ లిమిట్ పాటించకపోవడం, కొన్నిచోట్ల సిగ్నల్ జంప్ చేయడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం వంటి చర్యలతో రాష్ట్రంలో  అధిక చలాన్లు ఏర్పడ్డాయి. అంతమొత్తం కట్టలేక, పోలీసులు పట్టుకున్నప్పుడు కడదాంలే అనుకుంటూ ఉంటారు చాలామంది. గతంలో కూడా టూవీలర్లకి 75 శాతం, మిగిలిన వాహనాలకు 50 శాతం రాయితీలు ప్రకటించారు. దీనితో భారీ ఎత్తున చలాన్లు వసూలయ్యాయి. త్వరలోనే ఈ రాయితీపై ప్రకటన రావలసి ఉంది.