Home Page SliderTelangana

తెలంగాణా 10వ తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్

Share with

తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు తీపికబురు అందించింది. అదేంటంటే తెలంగాణా గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ MPC,MEC,BiPC కోర్సుల్లో ప్రవేశాల కొరకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది.కాగా ప్రభుత్వం ఈ గడువును ఏప్రిల్ 15వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని రాష్ట్ర గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి సీహెచ్.రమణ కుమార్  తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలోని 35 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. అంతేకాకుండా TSRJC ఎంట్రెన్స్ ఎగ్జామ్‌ను మే 6న నిర్వహిస్తామని వెల్లడించారు.