తెలంగాణా 10వ తరగతి విద్యార్థులకు గుడ్న్యూస్
తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు తీపికబురు అందించింది. అదేంటంటే తెలంగాణా గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ MPC,MEC,BiPC కోర్సుల్లో ప్రవేశాల కొరకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది.కాగా ప్రభుత్వం ఈ గడువును ఏప్రిల్ 15వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని రాష్ట్ర గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి సీహెచ్.రమణ కుమార్ తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలోని 35 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. అంతేకాకుండా TSRJC ఎంట్రెన్స్ ఎగ్జామ్ను మే 6న నిర్వహిస్తామని వెల్లడించారు.