గన్నవరం ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత
గన్నవరం ఎయిర్ పోర్ట్లో కస్టమ్స్ అధికారులు జరిపిన తనిఖీలలో భారీగా బంగారం పట్టుకున్నారు. షార్జా నుండి వచ్చిన కొంతమంది మహిళలపై అనుమానం వచ్చిన అధికారులు వారిని అడ్డుకున్నారు. వారి వద్ద ఉన్న వస్తువులను పరిశీలించారు. ఈ క్రమంలోనే వారి వద్ద 970 గ్రాముల బంగారం ఉన్నట్టు గుర్తించారు. ఆ మహిళలకు ఇంత బంగారం ఎక్కడిది అనే విషయం పై అధికారులు ఆరా తీస్తుతున్నారు. ప్రస్తుతం బంగారాన్ని మొత్తం సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు వారిని విచారిస్తున్నారు. అయితే పట్టుబడ్డ వారిలో ఒకరు ఏపీ ఐఏఎస్ అధికారి భార్యగా అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. అన్ని వైపుల నుండి దర్యాప్తు కొనసాగిస్తున్న అధికారులు మహిళలతో పాటుగా విమాన సిబ్బందిని ప్రశ్నించారు.