Home Page SliderTelangana

తెరుచుకున్నబాబ్లీ గేట్లు ..తెలంగాణాలోకి ప్రవేశించిన గోదావరి

Share with

భారతదేశంలోకి ఇటీవల రుతుపవనాలు ప్రవేశించిన విషయం తెలిసిందే. దీంతో ఉత్తర,దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ఏకధాటిగా కురుస్తూనే ఉన్నాయి. దీంతో భారతదేశంలోని నదులన్నీ ఉప్పంగుతూ.. ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహరాష్ట్ర-తెలంగాణా సరిహద్దుల్లోని బాబ్లీ గేట్లను అధికారులు తాజాగా తెరిచారు. కాగా ప్రాజెక్టుకు చెందిన 14 గేట్లను అధికారులు ఒకేసారి ఎత్తారు. దీంతో గోదావరి పరవళ్లు తొక్కుతూ తెలంగాణాలోకి ప్రవేశించింది. అయితే అక్టోబర్ 28వరకు ఆ గేట్లు తెరిచే ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.