Home Page SliderTelangana

కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి

Share with

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు గట్టిషాక్. ఆ పార్టీ నేత, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం కండువాకప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, బీఆర్ఎస్ స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కూడా హస్తం పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చే టైమ్ గురించి ఎదురుచూస్తున్నారు. త్వరలోనే వీరు పార్టీలో చేరనున్నట్లు సమాచారం.