ఢిల్లీ వరదలపై గౌతం గంభీర్ సంచలన వ్యాఖ్యలు
గతకొన్ని రోజులుగా ఢిల్లీలో కురుస్తున్న వర్షాలకు యమునా నది ఉగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీని వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ఢిల్లీ వరదలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఆప్ ప్రభుత్వ అసమర్థత వల్లే దేశ రాజధాని ఢిల్లీలో వరదలు వచ్చాయని ఆయన విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో వరదలు రావడం దురదృష్టకరమన్నారు. అయితే ఇది నాకు ఆశ్చర్యం కలిగించలేదన్నారు. కాగా ప్రస్తుత ప్రభుత్వం నగర మౌలిక సదుపాయాల కల్పనపై ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయట్లేదన్నారు. అయితే ఢిల్లీ సీఎం ఢిల్లీని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కానీ ఏమి చేయట్లేదు అని బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ మండిపడ్డారు.