Andhra PradeshHome Page Slider

బోరు వేస్తే వెలికి వచ్చిన గ్యాస్-కంగారులో స్థానికులు

Share with

కోనసీమ జిల్లాలోని రాజోలు మండలంలో శివకోటి వద్ద అక్వా చెరువులో బోరు నుండి గ్యాస్ వెలికి రావడం సంచలనం రేపింది. దీనితో స్థానికులు కంగారు పడుతూ అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. అక్వా చెరువులో మంచినీటి కోసం బోర్లు వేశారు. ఈ బోరు కారణంగా గ్యాస్ లీకైనట్లు తెలుస్తోంది. దీనితో ప్రమాదం సంభవించింది. ఆ గ్యాస్ నుండి అగ్నికీలలు ఎగసిపడుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఓఎన్జీసీ, అగ్నిమాపక సిబ్బంది కలిసి మంటలను అదుపులో తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ జిల్లాలో భూమిలో పెట్రోలియం నిల్వలున్నాయని తెలిసిందే. అప్పుడప్పుడు పంట పొలాలలో కూడా భూములలో గ్యాస్ లీకవుతూ ఉంటుంది.