రేపటి నుండే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలలో అందరినీ ఆకట్టుకున్న పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. దీనిని రేపటి నుండే అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణమైన మార్గదర్శకాల కోసం ఆర్టీసీ సిద్దమవుతోంది. ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ మునిశేఖర్ నేతృత్వంలోని అధికారుల బృందం నేడు కర్ణాటక బయలు దేరింది. అక్కడ మహిళలకు ఈ పథకం అమలు చేస్తున్న తీరు తెన్నులను పరిశీలిస్తోంది. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు నివేదిక సమర్పిస్తారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావాలని కూడా సజ్జనార్కు పిలుపు వచ్చింది. ఈ భేటీలో ఈ అంశాలు చర్చించనున్నారు. కర్ణాటకలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో అమలు చేస్తున్నారు. అది కూడా రాష్ట్రపరిధి వరకే. దీనితో తెలంగాణలో కూడా ఇదే విధమైన మార్గదర్శకాలు అమలు చేస్తారనే ఊహాగానాలు సాగుతున్నాయి. అంతరాష్ట్ర బస్సుల విషయంలో ఈ పథకం వర్తించదు.