NewsTelangana

బీజేపీ గూటికి టీఆర్ఎస్ మాజీ ఎంపీ

Share with

భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన ఆయన బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. సీనియర్ వైద్యులుగా గుర్తింపు పొందిన నర్సయ్య గౌడ్ 2013లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విజయం సాధించారు. కానీ 2019లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఓటమి పాలయ్యారు. గత కొద్ది రోజులుగా టీఆర్ఎస్ పార్టీకి నర్సయ్య గౌడ్ దూరంగా ఉన్నారు. మునుగోడులో బీసీలను కాదని రెడ్లకు ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు. మునుగోడు టికెట్ ఆశించిన ఆయన …టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు.