Andhra PradeshHome Page Slider

సీఎం జగన్‌తో భేటీ కానున్న మాజీ ఎంపీ పొంగులేటి

Share with

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి..కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఇవాళ ఏపీలోని తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీసుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ సీఎం జగన్‌తో ప్రత్యేకంగా భేటి కానున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర విభజన తరువాత పొంగులేటి శ్రీనివాస రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. తదనంతరం కొన్ని పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్‌లో చేరారు. తాజాగా రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ క్రమంలో పొంగులేటి సీఎం జగన్‌తో సమావేశం కావడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.