Andhra PradeshHome Page SliderNews

ఆంధ్రలో మరిన్ని సబ్ డిస్ట్రిక్ట్‌ల ఏర్పాటు

Share with

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం మరిన్ని కొత్త సబ్ డిస్ట్రిక్ట్‌లు ఏర్పాటుచేయబోతోంది. భూములు సర్వే అనంతరం పౌర సేవలు, రిజిస్ట్రేషన్ల కోసం ఈ సబ్ డిస్ట్రిక్ట్‌లు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పలు జిల్లాలకు అనుబంధంగా ఈ సబ్ డిస్ట్రిక్ట్‌లు ఏర్పాటు అవబోతున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కోనసీమ,కృష్ణా, ఏలూరు, కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు జిల్లాలలో ఇవి ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తర్వులు వచ్చాయి. వీటిలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటుఅవుతాయని ప్రభుత్వం పేర్కొంది. వీటిలో రిజిస్టార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిని కూడా ఉత్తర్వులలో పేర్కొంది. గ్రామ సచివాలయాల పరిధిని కూడా ఈ ఉత్తర్వులో పేర్కొన్నారు. 1908 లోని సెక్షన్ 5 ప్రకారం వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.