క్షమించి ఉద్యోగంలోకి తీసుకోండి సారూ..!
అనుకోకుండా చేసిన తప్పులతో తమను ఉద్యోగాల నుండి తీసేయడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, క్షమించి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఆర్టీసీలో సస్పెండైన కార్మికులు ప్రజాభవన్లో విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పలుమార్లు విన్నవించిన కార్మికులు మంగళవారం మరోసారి చేరుకుని ప్రజాభవన్ ఆవరణలో బైఠాయించారు. ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణిలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి, ప్రజావాణి ప్రత్యేక అధికారి దివ్య ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. సస్పెండైన ఆర్టీసీ కార్మికుల విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు.