జూరాల ప్రాజెక్టుకు జలకళ
తెలంగాణాలోని జూరాల ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. కాగా జూరాల ప్రాజెక్టుకు వరద ప్రారంభమైంది. అయితే ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి,నారాయణపూర్ డ్యామ్లకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో అధికారులు ఆ వరద నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 7,211 క్యూసెక్కులు,ఔట్ఫ్లో 139 క్యూసెక్కులుగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 9.66 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం జలాశయంలో 5 టీఎంసీల నీరు ఉన్నట్లు సమాచారం. ఈ వరద ప్రవాహం ఇలానే కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే జలాశయం పూర్తిస్థాయిలో నిండుతుందని అధికారులు వెల్లడించారు.