Home Page SliderNational

సిక్కింను ఆకస్మికంగా ముంచెత్తిన వరదలు

Share with

సిక్కిం రాష్ట్రాన్ని వరదలు ఒక్కసారిగా ముంచెత్తాయి.సిక్కింలో క్లౌడ్ బరస్ట్ జరగడంతో ఒక్కసారిగా ఆ రాష్ట్రమంతా వరదల్లో మునిగిపోయింది.కాగా ఈ ఆకస్మిక వరదలతో ఉత్తర సిక్కిం రాష్ట్రమంతా అతలాకుతలం అవుతోంది. ఈ కుంభవృష్టి వానతో తీస్తానదికి వరద పోటెత్తింది. దీంతో ఈ వరదల్లో దాదాపు 23 మంది ఆర్మీ జవాన్లు గల్లంతు అయినట్లు సమాచారం.కాగా ఈ వరదల్లో గల్లంతైన వారి కోసం పోలీసులు,సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.అయితే ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఈ వరదలతో సిక్కిం రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలన్ని నీట మునిగాయి. దీంతో అక్కడి ప్రభుత్వం రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది.